Tuesday, September 17, 2024

TG – న్యాయం చేయండి … డిజిపికి మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ ల మొర‌

క‌వ‌రేజ్ కి వెళితే కొండారెడ్డిప‌ల్లిలో దాడులు
దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోండి.

హైదరాబాద్‌ : డీజీపీ జితేందర్‌ను మహిళా జర్నలిస్టులు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో కలిశారు. నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్ లపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అంద‌జేశారు.అలాగే దీనిపై రాష్ట్ర మ‌హిళ క‌మిష‌న్ కూడా స్పందించింది.. ఈ సంఘటనపై వీలైనంత త్వరగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూలు ఎస్పీకి మహిళా కమిషన్‌ చైర్మన్‌ నేరెళ్ల శారద లేఖ రాశారు. నిందితులపై తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదిక ఇవ్వాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement