Sunday, September 29, 2024

TG – ఇక ఒక్క ఇల్లు కూడా కూలనీయం – తలసాని

హైదరాబాద్ – మూసీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల పేరుతో బుల్డోజర్లు తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారనీ, నగరంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా అడ్డుకుంటామని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

. కాంగ్రెస్‌ ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తేలేదన్నారు. హైడ్రా బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు హైదర్శ కోట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని ఆనయ మాట్లాడారు..60 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పేదలు ఉంటున్నారు. అధికారులే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అక్కడ నివసించే ప్రజలు ట్యాక్స్‌లు కడుతున్నారు. ఇప్పుడు అక్రమం అంటూ ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు.

- Advertisement -

ఆదర్శవంతమైన పాలన అందిస్తారనే విశ్వాసంతో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు . కానీ, సీఎం రేవంత్‌ రెడ్డి పాలన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. బాధితులు ధైర్యంగా ఉండండి మీకు మేము అండగా ఉంటామని భరోసానిచ్చారు. కేసీఆర్‌ నాయకత్వలోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలను కంటికి పాపలా కాపాడకుంటామన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement