Sunday, September 8, 2024

TG – సీఈవో గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సుద‌ర్శ‌న్ రెడ్డి

అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నేడు సుద‌ర్శ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించారు.. ఇంతకాలం ఆ ప‌ద‌విలో ఉన్న వికాస్‌రాజ్ ఆ బాధ్యతలను సుదర్శన్‌రెడ్డి అప్ప‌గించారు.. దీంతో సుద‌ర్శ‌న్ రెడ్డి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తించ‌నున్నారు. సీఈవో గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సుద‌ర్శ‌న్ రెడ్డి గ‌తంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో సర్వీసెస్, హ్యూమన్ రిసోర్స్ సర్వీసెస్ సెక్రెటరీగా విధులు నిర్వ‌హించారు. దీనికి ముందు హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీసు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. గతంలో రాష్ట్ర సర్వీసులో ఉన్న వికాస్‌రాజ్ 2022 మార్చిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement