Wednesday, July 3, 2024

TG – ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా విశ్రాంత ఐఎఎస్ అధికారి శ్రీనివాస రాజు

హైద‌రాబాద్ : జులై 01తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా మాజీ ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాస రాజు నియామకం అయ్యారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఈరోజు ఉత్త‌ర్వులు జారీ చేశారు. మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల స‌ల‌హాదారుగా శ్రీనివాస‌రాజు నియామ‌కం అయ్యారు.

తిరుమల తిరుపతి దేవస్థా నం జేఈవోగా సుదీర్ఘకాలం గా పనిచేసిన కేఎస్‌ శ్రీనివాస రాజు వీఆర్‌ఎస్‌ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ ఐఏఎస్‌ క్యాడర్‌లో 2001 బ్యాచ్‌కు చెందిన ఆయన 2011లో వైజాగ్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సమ యంలో టీటీడీ జేఈ వోగా నియమితులయ్యా రు.ఏప్రిల్‌ 20వ తేదీన జేఈవో గా బాధ్యతలు తీసుకుని 2019 జూన్‌ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ల రెండు నెలలపాటు పనిచేశారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో జేఈవోగా విధులు నిర్వహించి, టీటీడీలో తనదైన ముద్ర వేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement