Friday, September 20, 2024

TG కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఆర్టీసీ కార్మికుల రణభేరి!

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
40 అంశాలపై నేడు ప్రభుత్వానికి మెమోరాండం
సర్కార్‌ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ
ప్ర‌క‌టించిన జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నేత‌లు
పోరుబాట‌కు సిద్ధ‌మ‌వుతున్న కార్మిక సంఘం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు రణభేరి మోగించారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 40 అంశాలను ప్రభుత్వం ముందుంచాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయించింది. సర్కారు నిర్ణయం మేరకు కార్యాచరణ ఉంటుందని జేఏసీ నేతలు ప్రకటించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని రగలిపోతున్న కార్మికులు పోరుబాటకే సిద్ధమయ్యారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారం పెరిగిందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నా రు.

- Advertisement -

₹200 కోట్ల బాండ్ల బ‌కాయిలు..

ప్రభుత్వం నుంచి రావాల్సిన బాండ్ల బకాయిలు ₹200 కోట్లు, 2 పీఆర్సీ బకాయిలు, డీఏలు ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడం కార్మికుల్లో అసహనం పెరిగిందని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు చెబుతున్నారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీలో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించి, కార్మిక సంఘాలకు గుర్తింపు ఇస్తామనే మాటను కూడా పట్టించుకోకపోవడంపై ఆర్టీసీ జేఏసీ మండిపడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ఆర్టీసీ జేఏసీ తరఫున 40 అంశాలతో కూడిన మెమోరాండాన్ని రవాణా మంత్రి, ఎండీ, రవాణాశాఖ కమిషనర్‌ను కలిసి వారి ముందు పెట్టనున్నట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. కార్మికుల సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, లేకుంటే ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించనున్నట్టు వెల్లడించారు.

ఎన్నికలు నిర్వహించాలి: థామస్‌రెడ్డి, వెంకన్న

కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే ఆర్టీసీ ట్రేడ్‌ యూనియన్ల ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు థామస్‌రెడ్డి, వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వెల్ఫేర్‌ బోర్డుతో ఎలాంటి ప్రయోజనం లేదని, గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని వారు తేల్చి చెప్పారు. ఎంటీడబ్ల్యూ యాక్ట్‌ ప్రకారం 8 గంటలు మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లు పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 11 గంటలు, డబుల్‌ డ్యూటీలు చేయిస్తున్నారని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపకుంటా పోరుబాట తప్పదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement