Thursday, September 12, 2024

TG హైడ్రాకు రూ.25 ల‌క్ష‌ల ఎంపి నిధులు..

హ‌ద‌రాబాద్ – నగరంలో చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ కట్టడాలకు తెర లేపిన అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మద్ధతుగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిధులు అందజేశారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ. 25 లక్షలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలోని చెరువులను కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లోని చెరువులన్నీ కబ్జాకు గురయ్యాయన్నారు. కనీసం ఒక్క చెరువును కూడా కాపాడలేకపోయారని విమర్శించారు. అక్రమ కట్టడాలు చేపట్టిన వారు ఎవరైనా హైడ్రా వదిలిపెట్టదని ఎంపీ వ్యాఖ్యానించారు. డ్రగ్స్ నివారణ విషయంలో కూడా సీఎం ప్రత్యెక దృష్టి పెట్టారన్నారు. హైడ్రాను ఇతర జిల్లాలలో కూడా అమలు చేయాలనే వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయని.. జిల్లాలకు హైడ్రా విస్తరించాలని ఎంపీ అభిప్రాయపడ్డారు. హైడ్రాకు పూర్తి మద్దతు ఇస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement