Friday, September 20, 2024

TG ప్రజల హక్కుల సాధనకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతా : రేవంత్

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: ‘‘నేను ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంగళవారం గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పించారు.

అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని నిర్ణయించామని, విలీనం, విమోచనం అంటూ స్వప్రయోజనాల కోసం ప్రవర్తించడం సరికాదని అన్నారు.

సాయుధ పోరాటానికి దొడ్డి కొమరయ్య బీజం వేశారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడారన్నారు. ఈ సందర్భంగా నిజాంపై దాశరథి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించారు.ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం సముచితం. నాడు తెలంగాణ ప్రజల విజయం.. అందుకే ప్రజాపాలన దినోత్సవం జరుపుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.

- Advertisement -

దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు. ఇది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. ఇది మా పార్టీనో.. వ్యక్తిగతం కాదు.. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పిడికిలి అని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లు నియంత పాలన సాగింది. నాటి సాయుధ పోరాట స్ఫూర్తితో నియంత పాలనను గద్దెదించామని సీఎం అన్నారు. యువత ఆకాంక్షలు, అమరుల ఆశయాలు ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ అంటే నా కుటుంబం గత పాలకులు భావించారు. నిజాంను మట్టి కరిపించిన భూమి తెలంగాణ. టీఎస్ నుంచి టీజీ కేవలం అక్షర మార్పు కాదు.. ప్రజల ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళతా..

నేను ఫామ్ హౌస్ సీఎంను కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తా. మూసీ సుందరీకరణ.. తెలంగాణ రూపు రేఖలు మార్చుతుందని రేవంత్ అన్నారు. పదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన మత్తును వదిలిస్తున్నాం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. యంగ్ ఇండియా స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీ దేశానికే ఆదర్శంగా నిలుస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం హైడ్రాను తెచ్చాం. హైడ్రా విపత్కర కార్యం. హైడ్రా వెనుక ఎలాంటి రాజకీయాలు, స్వార్థం లేదు. హైడ్రాను కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆగదు. నేను మాట ఇస్తున్నా.. ప్రజలు సహకరించాలని సీఎం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement