Saturday, October 5, 2024

TG – మూసీ నిర్వాసితుల‌కు రేవంత్ భ‌రోసా

ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చూపిన త‌ర్వాతే కూల్చివేత‌ల‌
మీరూ కోరినంత ప‌రిహారం చెల్లిస్తాం
దీని కోసం రూ .10 వేల కోట్లు కేటాయించాం
విపక్షాల మిమ్మ‌ల‌ను అడ్డుపెట్టుక‌ని వారి ఆస్తులు కాపాడుకుంటున్నారు
మీరే వారి కుట్ర‌ల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేయాలి
జి వెంక‌ట‌స్వామి జ‌యంతి స‌భ‌లో రేవంత్ వివ‌ర‌ణ

హైద‌రాబాద్ – మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, వారికి త‌గిన ప్ర‌త్యామ్నాయం చూపిన త‌ర్వాత కూల్చివేత‌లు ప్రారంభిస్తామ‌న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు… చెరువుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయాల‌ని కోరారు. దివంగ‌త‌నేత గ‌డ్డం వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నేడు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ, ఈ రోజు మీ దగ్గరకొచ్చి కలిసి మీ సానుభూతి పొందాలనో, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ల ఆస్తులను కాపాడుకోవాలనో ప్రయత్నిస్తున్నార‌ని ఆరోపించారు. వారి కుట్ర‌ల‌ను మీరూ బ‌య‌ట‌పెట్టాల‌ని కోరారు.. కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టామని సీఎం వివరించారు.

విప‌క్షాలు మీరూ రండి.. ప‌రిహారం నిర్ణ‌యిద్దాం..

అనంతరం ప్రతిపక్షాలకు సవాల్ విసురుతూ.. అవసరమైతే ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాల దగ్గరకే ప్రభుత్వ అధికారులను పంపిస్తామని అంటూ మూసీ బఫర్‌జోన్‌లో, రివర్‌బెడ్‌లో ఉండి ఇళ్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వాలో అక్కడే కూర్చుని ప్రజలను అడిగి వాళ్లే సూచన చేయాలని, అదే తీర్మానాన్ని అసెంబ్లీలో చేద్దామని రేవంత్ సవాల్ విసిరారు.

ల‌క్ష కోట్లు మింగేశారు.
కాళేశ్వరం పేరుతో ఒక్క కుటుంబమే లక్ష కోట్లు మింగిందని గ‌త‌ కెసిఆర్ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు..తాము మాత్రం మూసీ నిర్వాసితుల‌ను ఆదుకోవ‌డం కోసం ప‌ది వేల కోట్లు ఖ‌ర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోందని, అద్భుతమైన ప్రణాళికలు తీసుకొస్తోందని చెప్పారు . ఇక వెంక‌ట‌స్వామి గురించి మాట్లాడుతూ, బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.

- Advertisement -

కాకా సేవ‌లు చిరస్మ‌ర‌ణీయం – భట్టి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాకా సేవలు చిరస్మరణీయమని అన్నారు.రాష్ట్రాన్ని అభివృద్ది చేసేందుకు గతంలో కూడా సలహాలు తీసుకున్నామని అన్నారు. కాకా చాలా గొప్ప నాయకుడని అన్నారు. ప్రజా సమస్యల కోసం అహర్నిసలు పాటుపడ్డారని అన్నారు. కాంగ్రెస్​ లో అంచెలంచలుగా ఎదిగిన కాకా.. హైదరాబాద్​లో ఉండే నిరుపేదలకు ఆశ్రయం కల్పించిన మహానేత వెంకటస్వామి. కాంగ్రెస్​ అధిష్ఠానం కాకాకు బాధ్యత అప్పగిస్తే దానిని తప్పక నెరవేర్చేవారని.. పేదల పక్షాన నిలబడ్డారన్నారు. తాను ఒకటి, రెండు సార్లు కాకాను కలిశానని తెలిపారు.

ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. విద్యాసంస్థల ద్వారా అంబేద్కర్ ఆశయాలను కాకా నెరవేర్చారని చెప్పారు. మలి దశ పోరాటంలోనూ ఆయన కృషి మరువలేనిదని, తొలి, మలి దశ ఉద్యమాల్లో కాకా పాత్ర కీలకం అని కోదండరాం కాకా సేవలను కొనియాడారు. ఎన్ని కష్టాలొచ్చినా కాంగ్రెస్ను వీడలేదని, కాకా జీవితంపై డాక్యుమెంటరీ తేవాలని కోదండరాం అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో కాకా అద్భుత శక్తి అని చెప్పారు.

ఈ కార్యక్రమానికి కాకా కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కాకా కుమారుడు, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాకా సేవలను నేతలు యాది చేసుకున్నారు. కాకాతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement