Friday, October 18, 2024

TG – సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం: సీఎం రేవంత్‌ రెడ్డి

మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టాం
కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకొన్నారు.
మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూసీనది అభివృద్ధి ప్రాజెక్టు వివరాల‌పై మాట్లాడుతూ,
”మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టాం. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని మరొకటి ఈ దేశంలో లేదు. దాదాపు 300 కి .మీ ప్రవహించే మూసీకి ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. మేం చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవం. కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకొన్నారు. మెదడులో విషం నింపుకొని మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నారు.

- Advertisement -

మూసి పరివాహక ప్రాంతాల్లో 33 మంది అధికారుల బృందం పని చేసిందని తెలిపారు. మూసి పరివాహక ప్రాంతం ప్రజలను ఆదుకోవడం ఎలా అనే దానిపై దృష్టి సారించారన్నారు. మూసి లో ఉన్న మురికి కంటే ఎక్కువ.. వాళ్ల మెదడు అంత విషం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. దుబాయ్ వెళ్లి.. సుందరీకరణ పేరుతో గుండు మీద జుట్టు పెంచుకొనే పాలసీ కాదని.. పోలీసులతో గుర్రాలతో తొక్కించినట్టు చేయమన్నారు. కొండపోచమ్మ , రంగనాయక సాగర్ , మల్లన్న సాగర్, కిష్టాపూర్ కి నేను సెక్యూరిటీ లేకుండా వస్తా.. మీరు వస్తారా అని బీఆర్‌ఎస్ నాయకులకు రేవంత్ సవాల్ విసిరారు.

“రచ్చ బండ నిర్వహిద్దాం.. కేసీఆర్.. నీ నియోజక వర్గానికే వస్తా. రచ్చ బండ దగ్గర కూర్చొని మాట్లాడదాం. మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు ఇచ్చిన బాధ్యత కాబట్టి ప్రజలకు మేలు చేయాలన్న దే మా ఆలోచన. మూసి సుందరీకరణ కాదు. ప్రక్షాళన. దుబాయ్ వెళ్లి జుట్టు మొలిపించుకునే టట్టు కాదు. నది ప్రవహించే నగరం దేశం లోనే లేదు. అలాంటి నగరం హైదరాబాద్ లో ఉంది. దాన్ని పాలకుల నిర్లక్షం వల్ల మురికి కూపం అయ్యింది. మూసి పునరుజ్జీవం పోస్తాం. సమస్యలు తెలుసుకుని ఒక్కొక్కరిని తరలించాలని మా ఆలోచన” అని అన్నారు. ఆరు నెల్ల నుంచి అధికారులు మూసీ ప్రాజెక్ట్ పై సర్వే చేస్తున్నారని రేవంత్ చెప్పారు.

వేములఘాట్.. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు.. ఎవరికైనా ఇండ్లు.. ఇంటి తాళం ఇచ్చారా అని ముఖ్యమంత్రి గ‌త ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు. “మిడ్ మనేరు ను పిల్లను ఇచ్చిన పాపానికి ఊరి నే ముంచారు. హైడ్రా ఏదైనా బూతమా.. ఫార్మ్ హౌస్ లో ఉన్న దొరనా. వచ్చి కబలించుకు పోవడానికి.. బఫర్ జోన్ లో 10 వేల ఇండ్లు ఉన్నాయి. వారిని ఎలా ఆదుకోవాలి.. బెటర్ లైఫ్ ఎలా ఇవ్వాలి అని ఎంఎల్ఏ లతో మాట్లాడండి అని మంత్రులకు చెప్పినం. బుల్డోజర్ లు మామీద నుంచి పోనియ్యాలి అని పోటీ పడుతున్నారు. నగరాన్ని సర్వ నాశనం చేయదలుచుకున్నారా అని విప‌క్షాల‌ను ప్ర‌శ్నించారు.

వర్షం వస్తె చెన్నై.. బెంగుళూరు ఏమైంది చూశారా..? దుబాయ్ ఏమైంది. వయనాడ్ లో పరిస్థితి ఏమైందో తెలియదా ఖమ్మం.. విజయవాడ మునిగి పోయింది. కండ్ల ముందు చూశాం. మూసి వల్ల మాకు ఆర్థిక ప్రయోజనం ఏమైనా ఉందా మాకు..? ఉప్పెన వచ్చిందంటే.. కొట్టుకు పోతాం. నాకు అనుకున్నవి అన్ని వచ్చాయి. నాకేమైనా వస్తుందా.. మీరంతా చెప్పండి.. వద్దు అంటే వదిలేద్దాం. టెండర్ క్యాన్సల్ చేసి పంపుతాం. నల్గొండ వాళ్ళ బాధలు పట్టవా. నల్గొండ వాళ్లంతా అడుగుతున్నారు. అడగడం అన్నా.. మానేయండి. నల్గొండ ప్రజలు మౌనగా ఉంటే ఎలా. నన్ను బ్లేమ్ చేసేది ఓ దోపిడీ దొంగ
వాడు నన్ను తిడితే బాధ పడను. లక్ష 50 కోట్లు అంటున్నాడు. ఇదేమైనా కాళేశ్వర మా?” అని ప్రతిపక్షాలను సీఎం ప్రశ్నించారు.

గ‌తంలో . సిలింగ్ యాక్ట్ నీ కూడా దొరలు.. భూస్వాములు వ్యతిరేకించారని.. ఎప్పుడు ఎవరో ఒకరు వ్యతిరేకిస్తునే ఉంటరన్నారు. అధికారం కోల్పోయిన వాళ్ళు కొందరు ఇలా ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారని.. అధికారులు.. మంత్రుల ముసుగులో దోచుకున్న బంది పోటు దొంగలు వాళ్ళు అని తీవ్రంగా విమర్శించారు. అలాంటి బందీ పోటు దొంగలు మూసిని అడ్డుకుంటున్నారని.. అద్దాల మెడల కోసం.. అందాల భామల కోసం మేము చేయడం లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement