Thursday, September 12, 2024

TG – రైతుల ఉసురు తీస్తున్న‌ కాంగ్రెస్‌ – మాజీ విప్ రేగా కాంతారావు

ఆంధ్ర‌ప్ర‌భ, భద్రాద్రి కొత్తగూడెం : కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల ఉసురు తీస్తోంద‌ని మాజీ విప్‌, బీఆర్ ఎస్ నేత రేగా కాంతారావు అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుస రైతు ఆత్మహత్య‌లు క‌లిచి వేస్తున్నాయ‌న్నారు. పురుగుల మందు తాగి ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఒక రైతు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానకీపురంలో ఒక రైతు ప్రాణాలు విడిచార‌న్నారు. రైతులెవ‌రూ ధైర్యం కోల్పోవ‌ద్ద‌ని అన్నారు. అన్ని ఘటనల వెనుక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఉంద‌ని ఆరోపించారు. రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement