Thursday, July 4, 2024

TG – ఉప ముఖ్యమంత్రి భట్టి చైర్మన్ గా రైతు భరోసా మంత్రివర్గ ఉప సంఘం

హైదరాబాద్‌: రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని జూన్‌ 22న మంత్రివర్గం నిర్ణయించింది.

ఆ మేరకు రైతు భరోసా మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎంపిక చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రైతు భరోసా విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement