Thursday, September 19, 2024

TG – మొయినాబాద్ ఫాం హౌస్ లో ముజ్రా పార్టీ భగ్నం

ఆంధ్ర‌ప్ర‌భ – చేవేళ్ల – రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సురంగల్ రెవిన్యూ పరిధిలోని ఓ ఫామ్ హౌస్‌లో జ‌రుగుతున్న ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు.

వీరు ఎలాంటి మాదకద్రవ్యాలు సేవించలేదని కేవలం మద్యం మాత్రమే సేవించారని వారి నుంచి 3 మధ్య సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి ఆరుగురిని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. అలాగే నలుగురు మహిళలను రేస్క్యూ హోమ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు. అలాగే ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసే ఫామ్ హౌస్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏమైనా పార్టీలు అరేంజ్ చేసినప్పుడు తప్పకుండా పోలీస్ వారి పరిమిషన్ తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement