Monday, September 16, 2024

TG – నెక్స్ట్ టార్గెట్ ఎమ్మెల్యే ప‌ల్లా ? .. బ‌ఫ‌ర్ జోన్ లో అనురాగ్ వ‌ర్శిటీ నిర్మాణాలు


పోచారం పిఎస్ లో అనురాగ్ వ‌ర్శిటీపై ఫిర్యాదు
స్థ‌లాన్ని ఆక్ర‌మించారంటూ ఇరిగేష‌న్ శాఖ సీరియ‌స్
చ‌ర్య‌లకు రంగం సిద్ధం చేస్తున్న అధికారులు

హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి షాక్ తగిలింది. బఫర్ జోన్లో అనురాగ్ యునివర్సిటీ నిర్మించారని ప్లలాపై కేసు నమోదు అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని వెంకటాపురంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్ లో నిర్మించారని పోచారం పీఎస్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఎగ్జిక్యూటీవి ఇంజినీర్ పరమేశ్వర్ ఫిర్యాదు చేశారు. బఫర్ జోన్ లో యూనివర్సిటీ నిర్మించారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అలాగే ఇరిగేష‌న్ శాఖ కూడా ప‌ల్లాకు నోటీసులు జారీ చేసింది.. వ‌ర్శిటీలోని బ‌ఫ‌ర్ జోన్ లో ఉన్న అక్ర‌మ నిర్మాణాలు తొల‌గించాల‌ని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement