Friday, September 20, 2024

TG – గవర్నర్‌ గా నేడు జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన జిష్ణుదేవ్‌ వర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిష్ణుదేవ్‌ త్రిపురలోని తన నివాసమైన కుంజబన్‌ ప్యాలెస్‌ నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు చేరుకొని సాయంత్రం 5.03 గంటలకు గవర్నర్‌గా బాధ్యతలు చేపడతారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్‌ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1990 ప్రారంభంలో బీజేపీలో చేరారు. జిష్ణుదేవ్‌ 2018 నుంచి 2023 వరకు త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement