Thursday, October 17, 2024

TG – మంత్రి కొండా సురేఖ‌కు కోర్టు నోటీస్

నాగార్జున వేసిన ప‌రువు న‌ష్టం పిటిష‌న్ పై విచార‌ణ‌
నేడు రెండో సాక్షి స్టేట్ మెంట్ రికార్డ్
వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ కోరుతూ మంత్రికి నోటీస్
విచారణ ఈ నెల 23కి వాయిదా .

హైద‌రాబాద్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌కు నాంప‌ల్లి ప్ర‌త్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున దాఖ‌లు చేసిన ప‌రువు న‌ష్టం కేసులో కొండా సురేఖ‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు కోర్టు పేర్కొంది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. నాగార్జున దాఖ‌లు చేసిన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా . ఇవాళ రెండో సాక్షి వెంక‌టేశ్వ‌ర‌రావు స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డు చేసింది. ఇప్ప‌టికే నాగార్జున‌, మొద‌టి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను ఈ నెల ఎనిమిదో తేదిన కోర్టు రికార్డు చేసింది. అనంత‌రం నాగార్జున కుటుంబం పై చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌రణ కోరుతూ కొండాకు నోటీస్ లు జారీ చేయాల‌ని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement