Tuesday, October 15, 2024

TG – ఆదివాసి మహిళకు అండగా ఉంటాం – మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జూన్ 22) ప్రభా న్యూస్…ఆదివాసి మహిళ ఈశ్వరమ్మ పై అమానుషంగా దాడి చేసి చిత్రహింసలకు గురి చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళ ఈశ్వరమ్మను మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు పరామర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ . ఆ కుటుంబం ఇంకొకరితో పని చేయకుండా గౌరవంగా బ్రతికేందుకు భూమి ఇచ్చి ఆదుకుంటామని తెలిపారు. ఈశ్వరమ్మకు మెరుగైన చికిత్స తో పాటు వారి పిల్లల విద్య అందిస్తామని వెల్లడించారు.ఆమెపై జరిగిన దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా కఠినాది కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement