Friday, October 18, 2024

TG – అమ్మ‌వారి విగ్ర‌హం ధ్వంసం కేసు – మెట్రో పోలీస్ హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు ..

నిందితుడు మెట్రో పోలీస్ హోట‌ల్‌లో బ‌స‌
వారం రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌ణాళిక‌
సిబ్బందికి తెలిసినా స‌మాచారం ఇవ్వ‌లేద‌ని మూసివేత‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని మెట్రో పోలీస్ హోట‌ల్‌ను పోలీసులు సీజ్ చేశారు. గురువారం హోట‌ల్‌లో ఉన్న వారంద‌రినీ ఖాళీ చేయించి పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టారు. అనంత‌రం సీజ్ చేశారు. అలాగే హోట‌ల్ లైసెన్స్ కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

నేరానికి వేదిక‌…
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఓ వ్యక్తి పెకిలించిన సంఘ‌ట‌న తీవ్ర సంచ‌ల‌నం రేక‌త్తించింది. దీనిపై మత సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు కూడా ద‌ర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే నిందితులు హోటల్ మెట్రోపోలీస్ లో బస చేసినట్లు సమాచారం వచ్చింది. వారం రోజులుగా నేరానికి వేదిక‌గా ఈ హోట‌ల్ మారింద‌ని పోలీసులు అనుమానించారు. ఈ విష‌యం తెలిసినా… పోలీసుల‌కు హోట‌ల్ సిబ్బంది క‌నీస స‌మాచారం ఇవ్వ‌లేదు. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి హోట‌ల్ ను సీజ్ చేశారు. అనంత‌రం లైసెన్స్ కూడా ర‌ద్దు చేస్తున్న‌ట్లు పోలీసు, రెవెన్యూ అధికారులు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement