Friday, October 18, 2024

TG – కులగణనను తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు

హుస్నాబాద్‌ – బీసీ కులగణనను పూర్తిగా సేకరించిన తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టత ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్‌లో శనివారం దసరా పండుగ సందర్భంగా ఎల్లమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక, రాజకీయ, ఆర్థిక సర్వే కోసం జీవో 18ను తీసుకొచ్చారని వివరించారు.

ఈ సర్వే 60 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. కులగణన ప్రక్రియలో రాష్ట్ర ప్రజలు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించిందని, 60 రోజుల వ్యవధిలో ప్రతి ఇంటి వివరాలను సేకరించే విధానాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.

- Advertisement -

కులాల ఆధారంగా వివిధ వివరాలను సేకరించడం ద్వారా, ప్రతి కుటుంబానికి లభిస్తున్న అవకాశాలను అంచనా వేస్తూ, భవిష్యత్తులో ప్రభుత్వానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవడానికి ఈ డేటా ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement