Saturday, June 29, 2024

TG | చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యేను పరామర్శించిన కేటీఆర్

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యేను మేడిపల్లి సత్యంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయన సతీమణి మరణంతో విషాదంలో ఉన్న సత్యం కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు. బుధవారం అల్వాల్ లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేక్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement