Friday, September 20, 2024

TG – పేద విద్యార్ధుల‌పై కూడా కక్షేనా … రేవంత్ ను నిలదీసిన కెటిఆర్

ఏకంగా 1864 స్కూళ్ల‌ను మూసివేస్తారా
ఇక పేద‌, మ‌ధ్య తర‌గ‌తి పిల్లల‌కు విద్య అంద‌ని ద్రాక్ష‌
ప్రాథ‌మిక విద్య‌ను బలోపేతం చేయ‌కుండా..
పాఠ‌శాల‌లు మూసివేత చ‌ర్య‌లేంటి
రేవంత్ స‌ర్కార్ పై కెటిఆర్ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపు గా 1,864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. చివ‌రికి పేద విద్యార్ధుల‌పై కూడా ఈ క‌క్ష సాధింపు చ‌ర్య‌లేంటీ అంటూ కెటిఆర్ ట్విట్ చేశారు..

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసి వేయాలని భావిస్తుండటం సిగ్గుచేటన్నారు. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2.4 లక్షలు తగ్గింది. ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement