Thursday, September 19, 2024

TG జవాబుదారీతనంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది : కేటీఆర్

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:జవాబుదారీతనంతోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని, దౌర్జన్యంతో కాదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉపన్యాసాలు ఇస్తుంటారని, కానీ తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని తుంగలొ తొక్కుతుంటే కళ్లు మూసుకున్నారని విమర్శించారు.

ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమేనా మీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజల గొంతుకే అసలైన ప్రజాస్వామ్యమని ఆదివారం ఎక్స్‌ వేదికగా ట్వీట్లో వెల్లడించారు. నిరంకుశత్వం.. అరాచకం..బుల్డోజర్లతో ఇండ్లు కూల్చడం, అసమ్మతిని అణచివేయడం, జర్నలిస్టులపై దాడి చేయడమేనా ప్రజాస్వామ్యం?. ప్రశ్నించే గొంతులను అణచివేయడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమేనా మీ ప్రజాస్వామ్యం?. ఇది ప్రజాస్వామ్యం కాదు.. నిరంకుశత్వం, అరాచకం.’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement