Thursday, September 19, 2024

TG – దోమల మందుకూ నిధుల్లేవ్​! ఇదేనా ప్ర‌జా పాల‌న‌

పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ లేదు
గ్రామాలన్నీ కంపుకొడుతున్నయ్​
జన జీవనం దినదిన గండంలా మారింది
మ‌లేరియా, డెంగీ వ్యాధులు విజృంభిస్తున్న‌య్‌
ఉపాధి హామీ, హెల్త్ మిష‌న్ ఫండ్స్ డైవ‌ర్ట్ చేశారు
ఆ ₹2100 కోట్లు ఏమయ్యాయో చెప్పాలి
రేవంత్ సర్కారు తీరుపై కేటీఆర్ విమ‌ర్శ‌లు

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​ : కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వానం మారింది.. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌ట‌మేనా? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించారు.

- Advertisement -

ఫండ్స్ లేక సంక్షోభంలో పంచాయ‌తీలు..

అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయ‌ని కేటీఆర్ అన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింద‌న్నారు. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింద‌న్నారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగీ, మలేరియా వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే?? అని కేటీఆర్ నిల‌దీశారు.

1800 మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు.. అక్రమ అరెస్టులు

నాడు.. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు టంచన్‌గా ₹275 కోట్లు విడుదల చేశామని, నేడు.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు.. అక్రమ అరెస్టులు చేశారని కేటీఆర్​ మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన ₹500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని నిలదీశారు. ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన ₹2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారన్నారు. 12,769 పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే ₹4305 కోట్లుగా ఉంటాయని అంచనా ఉందన్నారు. మరి వాటి పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement