Saturday, October 19, 2024

TG – గ్రూప్ 1పై రేవంత్, బండి సంజ‌య్ ల‌వి డ్రామాలు -కెటిఆర్

మండిప‌డ్డ మాజీ మంత్రి కెటిఆర్
బండి సంజ‌య్ కు ప‌రీక్ష‌లు గురించి ఏం తెలుసు
సుప్రీం కోర్టు తీర్పు వ‌ర‌కు పరీక్ష‌లు ఆపాల్సింది
అభ్య‌ర్ధులను ప్ర‌భుత్వం ప‌శువుల్లా చూస్తుంది..
గ్రూప్ 1 అభ్య‌ర్దుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన కెటిఆర్ ..

హైద‌రాబాద్ – గ్రూప్ 1 ప‌రీక్ష‌ల విష‌యంలో కేంద్ర మంత్రి బండి సంజ‌య్, ముఖ్య‌మంత్రి రేవంత్ లు డ్రామాలు అడుతున్నార‌ని బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. బండికి భారీ భ‌ద్ర‌త క‌ల్పించి ఆయ‌న‌తో రేవంత్ ఆదోంళ‌న చేయించార‌ని ఆరోపించారు.. అశోక్ న‌గ‌ర్ లో ఆందోళ‌న చేస్తున్న వారి వ‌ద్ద‌కు వచ్చిన కెటిఆర్ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప‌రీక్ష‌ల‌పై ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌రికాద‌న్నారు.. ప్ర‌భుత్వంవిద్యార్థుల ఆవేద‌న‌ను అర్థం చేసుకోవాల‌న్నారు.. ప‌రీక్ష‌లు గురించి సంజ‌య్ కు ఎం తెలుసు అంటూ ప్ర‌శ్నించారు.. ఉన్న‌త ఉద్యోగానికి శిక్ష‌ణ పొందుతున్న అభ్య‌ర్థుల‌ను రేవంత్ స‌ర్కార్ ప‌శువుల్లా చూస్తున్న‌ద‌ని ఫైర్ అయ్యారు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ది అన్నారు.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వ‌ర‌కు ప‌రీక్ష‌లు వాయిదా వేసిన‌ట్ల‌యితే బాగుందేద‌ని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement