Sunday, September 8, 2024

TG – మరి కొద్దిసేపట్లో కెసిఆర్ పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఆంధ్ర ప్రభ స్మార్ట్ | హైదరాబాద్‌, : విద్యుత్తు కమిషన్‌ అంశంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విద్యుత్తు కొనుగోళ్లు, యాదాద్రి, భదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్ల స్థాపనపై సమీక్షకు నియమించిన జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చి 14న జారీచేసిన జీవో 9ని సవాలు చేస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయటం, హైకోర్టు దాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement