Tuesday, September 17, 2024

TG – హైకోర్టు డివిజ‌న్ బెంచ్‌కు వెళ‌తాం : క‌డియం శ్రీ‌హ‌రి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, వ‌రంగ‌ల్ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హై కోర్టు తీర్పు మీడియా ద్వారా తెలిసిందని.. తాను ఇంకా పూర్తి జడ్జిమెంట్‎ను చూడలేదని తెలిపారు. ఏది ఏమైనా న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఈ వ్యవహారంలో అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్‎కు అప్పీల్‎కు వెళ్తామని.. పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement