Sunday, September 22, 2024

TG – యువ‌త‌తోనే స‌మాజ మార్పు – మంత్రి జూప‌ల్లి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, రంగారెడ్డి : యువ‌త‌తోనే స‌మాజ మార్పు సాధ్య‌మ‌ని టూరిజం కల్చరల్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నందిగామ మండ‌లం క‌న్హ శాంతివ‌నంఓ మూడో రోజు అంత‌ర్జాతీయ యువ స‌మ్మేళ‌నం జ‌రిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా జూపల్లి , షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు.

మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత హాజరవ్వడం గొప్ప విషయమన్నారు. మాన‌వ‌త్వం, ద‌య అల‌వ‌ర్చుకోవాలిప్రస్తుతం సమాజంలోని సమస్యలకు మనుష్యుల ఆలోచనలే కారణమ‌ని మంత్రి జూప‌ల్లి అన్నారు. మెడిటేషన్ ద్వారా మనుషుల్లో ప్రశాంతతతో మంచి ఆలోచనలు వస్తాయన్నారు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. యువత మానవత్వం, సమానత్వం, దయాగుణాలు అలవర్చుకోవాలన్నారు. యువత తల్చుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలదాన్నారు.

స‌హాయ స‌హ‌కారం అందిస్తా : ఎమ్మెల్యేఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున కన్హాకు అన్నీ విధాలుగా సహాయ సహకారాలుంటాయ‌ని అన్నారు. ఈ సమ్మేళనం కన్హా అధ్యక్షులు దాజి ఆధ్వర్యంలో మూడు జంటలు వివాహ బందంతో ఒక్కటయ్యారు.

- Advertisement -

ఇందులో రెండు జంటలు కొరియన్ జంటలు కాగా, ఒక జంట తెలంగాణ కు చెందిన వారున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement