Tuesday, October 8, 2024

TG – చెరువులు, మూసిపై చ‌ర్చ‌కు రండి .. కాంగ్రెస్ కు బిఆర్ఎస్ స‌వాల్

కాంగ్రెస్ కు బిఆర్ఎస్ ఎమ్మ‌ల్యే జ‌గ‌దీష్ రెడ్డి స‌వాల్
సుంద‌రీక‌ర‌ణ అంటే ఇళ్ల‌ను కూల్చ‌డం కాదు
మూసీలో మురుగునీరు క‌ల‌ప‌కుండా ఆప‌డం
ఆ మాత్రం కూడా తెలియ‌ని కాంగ్రెస్ నేత‌లు
రూ.16వేల కోట్ల‌తో తామే మూసీ ప్ర‌క్షాళ‌న‌కు ప్లాన్ వేశాం
తామే సుంద‌రీక‌ర‌ణ చేప‌డ‌తాం.. ఇచ్చే ద‌మ్ముందా
రేవంత్ స‌ర్కార్ కు ఆఫ‌ర్ ఇచ్చిన బిఆర్ఎస్

హైద‌రాబాద్ -చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి . అసలు ప్రభుత్వం వద్ద మూసీపై డీపీఆర్ ఉందా? అని ప్రశ్నించారు. మూసీని, హుస్సేన్ సాగర్‌ను మురికికూపంలో మార్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. సుందరీకరణ అంటే ఇళ్లు, గుడిసెలు కూలగొట్టడం కాదన్నారు. మూసీలో కలిసే మురికి నీటిని, కాలుష్యాన్ని ఆపడం సుందరీకరణ అంటారని చురక అంటించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ. మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ఏమిటో చెప్పాలని నిలదీశారు. మూసీ సుందరీకరణ తమ హయాంలోనే ప్రారంభమైందని, రూ.16 వేల కోట్ల ఖర్చు అవుతుందని డీపీఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్‌కు తీసుకువచ్చి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటికీ మూసీ ప్రక్షాళన చేసేందుకు తాము సిద్ధమని, మాకు ఇచ్చే దమ్ము మీకు ఉందా? అని సవాల్ చేశారు. ప్రభుత్వం వద్ద రుణమాఫీకే డబ్బులు లేవు, మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలన్నారు.

హైడ్రా కూల్చివేత‌ల‌తో ల‌క్ష కోట్ల ప్ర‌జాధ‌నం వృథా..

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల కారణంగా రూ.1 లక్ష కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యే అవకాశముందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రూ.1,000 కోట్ల వరకు ప్రజలు నష్టపోయారన్నారు. ఏదైన చేసే ముందు ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లుగ‌కుండా ముందుకు వెళ్లాల‌ని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement