Tuesday, September 17, 2024

TG ‘మెగాస్టార్’ తో ‘హైడ్రా’ బాస్ భేటీ

హైదరాబాద్, ప్రభ న్యూస్ – రక్తదానం ప్రాణదానంతో సమానమని నమ్మడమే కాక, అనేక సందర్భాల్లో ప్రజల్లో అవగాహన కల్పించిన మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని యువత, ముందుకు సాగాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) టాస్క్ ఫోర్స్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రంగనాథ్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి, కుటుంబ విషయాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగర ఇమేజ్ పెంచేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని రంగ‌నాథ్ ను చిరంజీవి ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement