హైదరాబాద్, ఆంధ్రప్రభ స్మార్ట్ : నగరంలో నిన్న (శుక్రవారం) రాత్రి నుంచి ముసురు కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో… హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ భారీ వరదలతో నిండిపోయింది. దీంతో అధికారులు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. చెరువు పూర్తి సామర్థ్యం 514 అడుగులు కాగా, ప్రస్తుతం 513 అడుగుల నీటి నిల్వ ఉంది.
ఇక రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.