Thursday, July 4, 2024

TG – రేవంత్ పాల‌న‌లో స్థానిక సంస్థ‌ల నిర్వీర్యం … మ‌లేరియా, డెంగీ ప్ర‌భ‌లితే బాధ్య‌త ఎవ‌రిది – హరీశ్ రావు


ఏడు నెల‌ల కాలంలో పంచాయితీల‌కు ఒక్క పైసా విదిల్చారా
తాము గ్రామాలు అభివృద్ది చేశాం.. ఎన్ని అవార్డులు సాథించాం
లోక‌ల్ బాడీల‌కు కూడా ఎన్నిక‌ల నిర్వ‌హించ‌లేని ప్ర‌భుత్వం మీది
ఎన్డీఎలో చ‌క్రం తిప్పుతున్న‌చంద్ర‌బాబుతో
చ‌ర్చ‌లు జ‌ర‌పండి.. ఆ ఏడు మండలాలు, సీలేరు తెండి
రేవంత్ కు మాజీ మంత్రి హారీష్ రావు విన‌తి

హైద‌రాబాద్ – స్థానిక సంస్థలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హ‌రీష్ రావు. మలేరియా, డెంగీ వైరల్ జ్వరాలు ప్రభలితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. తెలంగాణ భ‌వ‌న్ లో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. సర్పంచుల టర్మ్ ముగిసిందని, జిల్లా పరిషత్ కాలం ముగిస్తోందని.. అయినా ఎన్నికలు నిర్వహించడం లేదని కాంగ్రెస్ సర్కారుపై సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థలకు ఎన్నికల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాడు 87 ట్రాక్టర్లు పంచాయతీల్లో ఉంటే నేడు 12,769 ట్రాక్టర్లు ఉన్నాయన్నారు. దీన్ దయాల్, సంసద్ ఆదర్శ యోజన అవార్డులు తెలంగాణకు వచ్చాయని గుర్తు చేశారు.

- Advertisement -

ఏడు నెల‌ల కాలంలో ఒక్క పైసా ఇచ్చారా..

గ్రామాలను తమ ప్రభుత్వ హయాంలో చాలా అభివృద్ధి చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. 7 నెలల్లో గ్రామాలకు 7 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చిందని.. దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలను కేసీఆర్ నిలిపారన్నారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కూడా జీతం ఖమ్మంలో రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారని.. వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఉద్విగ్నానికి లోనయ్యారు. కాంగ్రెస్సే రైతు ఆత్మహత్యకు కారణమని ఆరోపించారు. చనిపోయిన రైతు సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారని.. బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

రేవంత్ జీ ఆ ఏడు మండ‌లాలు, సీలేరు తీసుకురండి..

ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి తెలంగాణ‌కు చెందిన 7 మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు.. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్ళలో 7 మండలాలు, లోయర్ సీలేరు ఏపీలో కలిపారని గుర్తు చేశారు. కేసీఆర్ నాడు తీవ్రంగా స్పందించి, నిరసన తెలిపారన్నారు. బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అని పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు మీ సహచరుడు చంద్ర‌బాబు మీదనే ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడిందని.. చంద్రబాబు మీద ఒత్తిడి చేసి 7 మండలాలు, లోయర్ సీలేరు మనకు వచ్చేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఆ తర్వాత విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.

ఆ రైతు కుటుంబానికి రూ.25 ల‌క్ష‌లు న‌ష్ట ప‌రిహారం ఇవ్వండి…

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని ఖమ్మంలో చనిపోయారన్నారు హ‌రీశ్ రావు. కండ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన రైతు ఆత్మహత్య బాధాకర‌మ‌ని,. వీడియో చూస్తే కన్నీళ్లు వస్తున్నాయన్నారు.. ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement