Friday, September 13, 2024

TG – రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న … హ‌రీశ్ ధ్వ‌జం

ముందుగా మేల్కొనక‌పోవ‌డంతోనే తీవ్ర వ‌ర‌ద న‌ష్టం
బాధితుల‌కు మంచినీళ్లు కూడా ఇవ్వ‌ని స‌ర్కార్
సాయం చేసే మా చేతుల‌పైనే దాడులు
మేం చేసేది ఉడ‌త సాయ‌మే…అదీ మీరు చేయ‌డం లా
కాంగ్రెస్ పాల‌న‌పై హ‌రీశ్ రావు

సిద్దిపేట – రాష్ట్రంలో నడుస్తున్నదని ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని చెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణనష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు.

- Advertisement -

మాది ఉడ‌త సాయం..

సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు హ‌రీశ్ రావు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగిలిన పార్టీల నాయకులు సహాయం చేయడానికి మందుకు రావాలన్నారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదుచేస్తున్నారని వెల్లడించారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని వెల్లడించారు. తమకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని రేవంత్ స‌ర్కార్ పై విరుచుకుప‌డ్డారు హ‌రీశ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement