Tuesday, September 17, 2024

TG ఇక ఉప ఎన్నిక‌లు ఖాయం …. హ‌రీశ్ రావు

అన‌ర్హ‌త ఎమ్మెల్యేల తీర్పుపై హ‌రీశ్ రావు
ఈ తీర్పు కాంగ్రెస్ కు చెంప‌పెట్టే
ఉప ఎన్నిక‌ల‌లో అన్ని స్థానాలు గెలుస్తాం..

హైద‌రాబాద్ : ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామిక‌ విధానాల‌కు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమ‌న్నారు. ఈ మేరకు ఆయ‌న ఎక్ లో ట్విట్ చేశారు.

- Advertisement -

తెలంగాణ హైకోర్టు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిల‌బెట్టే విధంగా ఉంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం ఖాయ‌మ‌న్నారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ త‌ప్ప‌కుండా గెలుస్తుంద‌న్నారు. హైకోర్డు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర శాస‌న స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామ‌ని హ‌రీశ్‌రావు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement