Saturday, October 5, 2024

TG | ఏడు బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్…

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపిన బిల్లుల్లో తాజాగా ఏడింటికి ఆమోదం లభించింది. మరో 4 బిల్లులు పరిశీలనలో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌తో సమావేశమై బిల్లుల గురించి ప్రస్తావించగా, గవర్నర్ శనివారం ఏడు బిల్లులకు ఆమోదం తెలిపారు.

ఆమోదించిన ఏడు బిల్లుల్లో మూడు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవి కాగా ఒకటి మున్సిపల్ శాఖకు సంబంధించినది. ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రుల నిర్మాణం, మైనారిటీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు కూడా ఆమోదించబడ్డాయి. దీంతో మొత్తం 7 బిల్లులకు క్లియరెన్స్ రావడంతో పరిశీలనలో ఉన్న మరో 4 బిల్లులపై త్వరలో స్పష్టత రానున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement