Friday, September 13, 2024

TG: 7 పెండింగ్ బిల్లులకు గవర్నర్ ఆమోదం…

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన 7 బిల్లులను మాజీ గవర్నర్ తమిళిపై సౌందర్య రాజన్ పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు ఇన్‌ఛార్జ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ బిల్లులకు అప్పటి గవర్నర్ తమిళి సై నో చెప్పగా, ఇప్పటికి మోక్షం లభించింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణపై 3 బిల్లులతోపాటు ప్రైవేటు వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మైనార్టీస్ కమిషన్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు అమల్లోకి వచ్చాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement