Friday, September 13, 2024

TG – ఇందూరులో అంగరంగ వైభవంగా ఊర పండగ

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్) :ఇందూరులో ఊర పండుగను నగర ప్రజలు సంబురంగా జరుపుకున్నారు. ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊరపండును జరపడంలో నిజాంబాద్ నగర ప్రజలు ప్రత్యేకత చాటుకున్నారు. పాడి పంటలు ఆయురారోగ్యాలతో అందరూ సుఖ శాంతులతో చల్లంగా ఉండేలా దీవించు తల్లి అంటూ అమ్మవారిని ఇందూరు ప్రజలు వేడుకున్నారు..

ఆదివారం నిజామాబాద్ నగరంలో సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా నగర ప్రజలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పండుగ విశేష పదార్థంగా సరిని నగరంలో చల్లుతూ పంటలపై పశుసంపదలపై చెరువులో కలిపారు.ఊర పండుగ నిర్వహణ కమిటీ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె( తేలు మైసమ్మ గద్దె) వద్ద గ్రామదేవతలను పసుపు కుంకు మ, చెవి పోగుల ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

- Advertisement -

*ఖిల్లా చౌరస్తా నుంచి దేవతామూర్తుల ఊరేగింపు*

దేవతామూర్తులను ఊరేగింపుగా ఖిల్లా చౌరస్తా నుంచి గాజులపేట చౌరస్తా మీదుగా పెద్ద బజారు చౌరస్తా వరకు వచ్చి… అక్కడనుండి రెండు బృందాలుగా విడిపోయి డబ్బులు…పోతరాజుల విన్యా సాలతో మహిళల పూనకాలతో ఒక బృం దం పౌడలమ్మ.. నల్ల పోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ ,పులి రాట్నం , రెండో బృందం సిర్నాపల్లి గడి గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్ నగర్ ఐదు చేతుల పోచమ్మ మత్తడి పోచమ్మ మహాలక్ష్మమ్మలతో అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. సరిని నాలుగు గ్రూపులుగా విభజించి దుబ్బ వినాయక ఎల్లమ్మ గుట్ట కంటేశ్వర్ ప్రాంతాలకు చల్లుకుంటూ వెళ్లారు..

*తొట్టెల కింద నుంచి వెళ్లేందుకు పోటీ పడ్డ జనం*

ఆరాధ్య దేవతలైన గ్రామ దేవతను కొలుస్తూ ఈ ఊరపండును జరపడంలో నిజామాబాద్ నగర ప్రజలు ప్రత్యేకత చాటుకున్నారు. అమ్మవారి ప్రతిరూపంగా తొట్టెలను ఊరేగిస్తారు.. ఈ తొట్టెల కింద నుంచి జనం వెళ్లేందుకు జనం పోటీప డ్డారు. చిన్న పెద్ద తేడా లేకుండా తొట్టెల కింద కూర్చొని నుంచి ఆయురారోగ్యాలను ప్రసాదించు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు.

ప్రజలను సల్లంగా చూడమ్మా తల్లి… ఎమ్మెల్యే ధన్పాల్

ఇందూరు ప్రజలు చల్లంగా ఉండేలా దీవించు తల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు. ఊర పండుగలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇందూరులో ఊరపండుగను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ సంవత్సరం పాడి పంటలతో, ఆయు రారోగ్యాలను ప్రసాదించాలని అమ్మ వారిని వేడుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్వ సమాజ్ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ ఇల్లందుల ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ప్రముఖులు పాల్గొన్నారు.

ఊర పండుగ సందర్భంగా రాజకీయ నాయకులు అమ్మవారి దర్శనం చేసుకు న్నారు. దర్శనం కోసం వచ్చిన వారికి నిర్వాహకులు స్వాగతం పలికి సత్క రించారు. ఊర పండుగలో పాల్గొన్న నాయకులకు సర్వసమాజ్ కమిటీ ఊరపండువ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement