Tuesday, October 15, 2024

TG – చందపల్లిలో క్షుద్ర పూజల కలకలం

గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు…

గుప్త నిధుల కోసమే తవ్వక్కాలా…?…

పోలీసుల అదుపులో నిందితులు.

పెద్దపల్లి రూరల్, జూలై 14(ప్రభ న్యూస్): అర్ధరాత్రి తర్వాత పెద్దపల్లి జిల్లా చందపల్లిలో క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న పలువురిని ఆదివారం తెల్లవారు జామున పోలీసులు పెద్దపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.

చందపల్లి ఎస్సారెస్పీ ప్రధాన కాలువ సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గుడారం ఏర్పాటు చేసుకుని అర్థరాత్రి తర్వాత పూజలు ప్రారంభించారు. అ ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి వారి కార్యకలాపాలు చేపట్టారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుద్ర పూజలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అక్కడ క్షుద్ర పూజలు గుప్త నిధుల కోసం చేశారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక యుగంలో కొందరు అమాయక ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకుని క్షుద్ర పూజల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. పెద్దపల్లి మండలంలో ఇలాంటి క్షుద్ర పూజలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement