Wednesday, July 3, 2024

TG – ప‌ది రోజుల‌లో ఉస్మానియా, కాక‌తీయ హ‌స్ట‌ల్స్ కు శంఖుస్థాప‌న – మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ

డాక్ట‌ర్స్ డే సంద‌ర్బంగా వైద్యుల‌కు మంత్రి దామోద‌ర శుభాకాంక్ష‌లు
24 అంత‌స్టుల కంటే నాణ్య‌తా ప్రామాణాల సేవ‌లే ముఖ్యం
11 అంత‌స్థుల హాస్పిట‌ల్స్ నిర్మాణాల‌కు ప్రాధాన్య‌త
నీట్ పరీక్ష‌పై దేశ వ్యాప్త చ‌ర్చ జ‌రగాల్సిందే

హైద‌రాబాద్ – ఇప్ప‌టి వ‌ర‌కు ఉస్మానియా హాస్టల్ బిల్డింగ్ లేదని.. 10 రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన చేస్తామ‌ని వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ చెప్పారు.. నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా రాష్ట్ర ఆయ‌న వైద్యుల‌కు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, రెండేళ్లలో హాస్టల్స్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు.. హెచ్‌ఆర్ కూడా ముఖ్యమన్నారు. ప్రస్తుతం హెచ్‌ఆర్‌లో ఇన్‌బ్యాలెన్స్ కొనసాగుతోందన్నారు. దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది… కాబట్టి ప్రక్షాళన చేస్తామన్నారు.అదనపు సదుపాయాలతో పాటు క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని.. ప్రజలు ఇది నా ఆసుపత్రి అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. ఫుడ్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు వేగవంతంగా చేస్తున్నామని మంత్రి తెలిపారు.

- Advertisement -

ఆస్పత్రులను 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదని.. సేవలు ఎలా అందుతున్నాయదే ముఖ్యమన్నారు. టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు కొనసాగుతాయన్నారు. 13 అంతస్తులు అనేది నిబంధన ఉంది.. అందుకు త‌మ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దాని ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. నిలోఫర్, ఎంఎన్‌జేలకు ఒక ప్రత్యేకత ఉందని.. అలాగే మిగతా వాటికి కూడా ప్రత్యేకత ఉండాలన్నారు. ఇప్పటికే హెచ్ఓడీల ప్రక్షాళన జరుగుతుందన్నారు. హెచ్‌ఓడీలతో సరిగ్గా పని చేయిస్తామని, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఉస్మానియాను పరిశీలించేందుకు సెక్రటరీని పంపామన్నారు. హెచ్‌ఓడీ పోస్టులు అసలు లేనే లేవన్నారు. వారి స్థానంలో ఇంచార్జీలు పని చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నిర్వహించే ఏ పరీక్ష అయినా తాము నిర్వహించుకునే శక్తి ఉందని అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయని అంటూ ఇది కోర్టులో ఉందన్నారు. నీట్‌ను రద్దు చేయాలా, కేంద్రం నిర్వహించాలా, రాష్ట్రాలకు ఇవ్వాలా అనేదానిపై చర్చ జరగాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం అప్లై చేశామని.. మరిన్ని వస్తాయన్నారు. జూడాల సమ్మె సమయంలో వారి సమస్యలు 80శాతం పరిష్కరించామని మంత్రి తెలిపారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement