Friday, October 18, 2024

TG: మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్ మృతి

కరీమాబాద్ అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) వరంగల్ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ ఎంబాడి రవీందర్(65) మృతిచెందారు. గత కొంత కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుశుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఎదిగాడు రెండుసార్లు కార్పొరేటర్ గా శివనగర్ నుండి గెలుపొంది ప్రజా నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. రవీందర్ మృతి పట్ల ప్రజాప్రతినిధులు అండర్ రైల్వే గేట్ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పెరిక వాడ, శివనగర్ లో విచార ఛాయలు అలుముకున్నాయి.ఆయనకు భార్య , ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెరిక వాడలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement