Saturday, September 7, 2024

TG – ఓ తండ్రి ఘాతుకం … ముగ్గురు పిల్ల‌ల‌తో క‌ల‌సి ఆత్మ హ‌త్యాయ‌త్నం ..

హైదరాబాద్ ‍ ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని ఇనాంగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీఎన్.రెడ్డి ప్రాంతానికి చెందిన అశోక్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇనాంగూడ చెరువు వద్దకు వచ్చాడు. అనంతరం పిల్లలను కారులో కూర్చొబెట్టుకుని డోర్లు అన్ని లాక్ చేసి చెరువులోకి కారును పోనిచ్చాడు . కారు నీట మునగడం గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. . అందులో ఉన్న నలుగురు నీట మునిగిపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించారు. అందుబాటులో ఉన్న ట్యూబులు, తాళ్ల సాయంతో చెరువులోకి వెళ్లారు. తండ్రితో పాటు ప దేళ్లలోపు వయసున్న ఒక బాలుడు, ఇద్దరు బాలికల్ని ప్రాణాలతో కాపాడారు. వారిని బయటకు తీసుకు వచ్చిన తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యారు. ఆత్మహత్య చేసుకోడానికి చెరువులోకి కారును పోనిచ్చినట్టు తెలిసి అవాక్కయ్యారు.

భార్యతో ఉన్న విభేదాల నేపథ్యంలో పదేళ్లలోపు వయసు ఉన్న ముగ్గురు పిల్లల్ని చంపి తాను చనిపోవాలని భావించినట్లు తండ్రి అశోక్ తెలిపాడు. భార్య తన మాట వినడం లేదనే కోపంతో ఆఘాయిత్యానికి పాల్పడినట్టు వాపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement