Thursday, July 4, 2024

TG | రాధాకిషన్‌కు ఎస్కార్ట్ బెయిల్‌ మంజూరు..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు రెండు రోజుల పాటు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఈక్రమంలో ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న రాధా కిషన్‌రావు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు బెయిల్‌ మంజూరైంది.

కాగా తన తల్లి నెల మాసికంలో పాల్గొనేందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తల్లి పొట్లపల్లి సరోజవాదేవి గత నెల అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement