Friday, October 18, 2024

TG – మ‌రికొద్ది సేప‌టిలో ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం ..

హైదరాబాద్ : డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ మ‌రికొద్ది సేప‌టిలో ప్రారంభ‌కానుంది.. వాస్త‌వానికి నేటి ఉద‌యం ఈ కౌన్సెలింగ్ ప్రారంభం కావల‌సి ఉండ‌గా సాంకేతిక కారణాల‌తో వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ వెల్లడించింది. కాగా, సాంకేతిక స‌మ‌స్య పరిష్కారం కావ‌డంతో మ‌రికొద్ది సేప‌టిలో కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

తెలంగాణలో డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు నేడు పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్స్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఎక్కువగా కలెక్టరేట్లలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండనుంది. ఎస్జీటీకి ఒక హాల్, స్కూల్ అసిస్టెంట్, ఇతర పోస్టులకు కలిపి మరో హాల్ ఏర్పాటు చేసి..అందులో మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ కేటాయిస్తారు. వారు తమకు కేటాయించిన పాఠశాలల్లో ఈనెల 16వ తేదీన చేరాల్సి ఉంటుంది.వారు చేరిన స్థానంలో 3 నెలల క్రితం బదిలీ అయిన రిలీవ్ కాని వారు ఉన్నట్లయితే వారు గత జులైలో కేటాయించిన పాఠశాలలకు వెళ్తారు. అలాంటి వారు సుమారు 7వేల మంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement