Tuesday, September 17, 2024

TG – పిచ్చికుక్క సైర్వవిహారం: పదిమందికి గాయాలు

నందిపేట్, సెప్టెంబర్ ,9(ప్రభ న్యూస్): నందిపేట మండల కేంద్రంలో పిచ్చికుక్క సైర్వ విహారం చేసి సుమారు పదిమందిని కరిచి గాయపరిచింది. నేడు పిచ్చికుక్క పలువురిపై దాడి చేసి గాయపరిచింది. మండల కేంద్రంలోని నియో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నుండి ఆర్మూర్ బైపాస్ రోడ్ వరకు పలువురు నీ కరిచినట్లు స్థానికులు తెలిపారు. వీరిని ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో చికిత్స చేశారు. ఒకరిని నిజాంబాద్ ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ తెలిపారు.పిచ్చికుక్క దాడితో గ్రామంలో ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటున్నారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని బయటకు వెళ్లాలంటే భయం వేస్తుందని పలువురు అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement