Wednesday, October 9, 2024

TG:తండ్రీకుమారుల దుర్మ‌ర‌ణం


నిర్మల్- బైంసా రహదారిపై ప్ర‌మాదం
చెట్టును ఢీకొన్న కారు
త‌ల్లీకుమార్తెల‌కు గాయాలు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, నిర్మ‌ల్ : నిర్మ‌ల్ – బైంసా ర‌హ‌దారిపై బుధ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో తండ్రీకొడుకులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. త‌ల్లీకుమార్తెల‌కు గాయాల‌య్యాయి. ఒకే కుటుంబానికి చెందిన వారంతా ప్ర‌మాదంలో చిక్కుకోవ‌డంతో సొంత గ్రామ‌మైన లోకేశ్వ‌రం మండ‌లం మ‌న్మ‌ధ్ గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

అత్త వారింటి నుంచి వ‌స్తుండ‌గా…
ఆదిలాబాద్ జిల్లా కుచులాపూర్ గ్రామంలో ఉన్న అత్త‌వారి ఇంటి నుంచి సొంత గ్రామ‌మైన లోకేశ్వ‌రం మండ‌లం మ‌న్మధ్ గ్రామానికి సంగెం సురేష్ త‌న కుటుంబంతో వ‌స్తుండ‌గా ప్ర‌మాదానికి గుర‌య్యాడు. నిర్మ‌ల్‌-బైంసా రోడ్డులో కారు అదుపు త‌ప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో కుమారుడు ఏడేళ్ల దీక్షిత్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన సంగెం సురేష్ (27) చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య‌, కుమార్తెల‌కు గాయాల‌య్యాయి. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. పండ‌గ కోసం వెళ్లి తిరిగి వ‌స్తున్న సురేష్‌, దీక్షిత్ మృతితో అత్త‌వారి గ్రామ‌మైన కుచులాపూర్‌, మ‌న్మ‌ధ్ గ్రామాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

మ‌రో ప‌ది నిమిషాల్లో ఇంటికి చేరాల్సి ఉండ‌గా…
విద్యుత్ స‌బ్ స్టేష‌న్‌లో ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేస్తున్న సంగెం సురేష్ మ‌రో ప‌ది నిమిషాల్లో గ‌మ్యం స్థానం మ‌న్మ‌ధ్ కు చేరుకోవ‌ల‌సి ఉండ‌గా ఇంత‌లోనే ప్ర‌మాద రూపంలో మృత్యువు క‌బ‌ళించింది. నర్సాపూర్ మండలంలోని తురాటి గ్రామ సమీపంలో ప్ర‌మాదం జ‌రిగింది. విధుల నిర్వ‌హ‌ణ‌కు వ‌స్తుండ‌గా సంగెం సురేష్ ప్ర‌మాదంలో చిక్కుకుని మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement