Wednesday, September 25, 2024

TG – రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు – నేడు రేవంత్ పై కోర్టులో కేసు విచారణ

హైదరాబాద్ – రిజర్వేషన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో సీఎం రేవంత్ పై నమోదైన కేసుపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. రిజర్వేషన్లను తీసేసేందుకు బీజేపీ యత్నిస్తోందని గతంలో సీఎం వ్యాఖ్యానించారు.

బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా రేవంత్ మాట్లాడారని ఆ పార్టీ ప్రధాన కార్య దర్శి కాసం వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్ పై కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement