Friday, September 20, 2024

TG CM – రేవంత్ నేటి షెడ్యూల్ ఇదే

హైదరాబాద్ – సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఉదయం 11.30 కు సచివాలయంలో సివిల్ సప్లయిస్ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమీక్ష అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశంలో సీఎం పాల్గొననున్నారు..

స్కిల్ ఎంప్లాయి రావడం లేదని పారిశ్రామిక వేత్తలు అడుగుతున్నారన్నారని.. అందుకే ఐటిఐ లను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చ బోతున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ పారిశ్రామిక వేత్తలతో ఆనంద్ మహేంద్ర సమావేశం అవుతారని నిన్న జరిగిన ఎంఎస్‌ఎఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తారన్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనం ఏం లేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement