Friday, October 18, 2024

TG: తాళం వేసిన ఇంట్లో చోరీ

నగదు ,బంగారం ఎత్తు కెళ్ళిన దుండగులు

నిజామాబాద్ క్రైమ్ అక్టోబర్ 17:(ఆంధ్రప్రభ):నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ సీతారాం నగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన చోటు చేసుకుంది. ఐదవ టౌన్ ఎస్ఐ కథనం ప్రకారం.. సీతారాం నగర్ కాలనీలో రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి సదరు ఇంటి యజమాని పనుల నిమిత్తం ఊరికి వెళ్ళాడు. బుధవారం అర్ధరాత్రి దుండగులు తాళం వేసిన ఇంట్లో చోరి చేశారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని రూ.25 వేల నగదు, 4 గ్రాముల బంగారం ఎత్తుకె ళ్లారు. ఈ ఘటనకు సం బంధించి ముగ్గురు దుండ గులు ఉన్నట్టు సీసీ కెమె రాలు నిక్షిప్తమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement