Thursday, October 3, 2024

TG అభివృద్ధి ప‌నుల‌కు స‌హ‌క‌రించండి – మంత్రి శ్రీధ‌ర బాబుకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు విన‌తి

హైద‌రాబాద్ – తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులకు సహకరించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర బాబుని కోరారు. ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు నేడు మంత్రి కార్యాల‌యంలో క‌లిశారు.. అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందించారు. అలాగే, జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయాలని వారు శ్రీధర్ బాబును కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీహెచ్ఎంసీకి నిధులు విడుదల చేయలేదని వారు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement