Saturday, July 6, 2024

TG – అన్ని హామీలు అమ‌లుకు క‌ట్టుబ‌డి ఉన్నాం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

హైదరాబాద్‌: ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భ‌వ‌న్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధర్మబద్ధంగా ప్రతి పైసాను ఖర్చుపెట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. రైతు భరోసాపై విధి విధానాలు రూపొందిస్తున్నాం.. అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం” అని భట్టి అన్నారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని భట్టి మండిపడ్డారు. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామ‌ని, అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా ప్రకటన చేస్తామని తెలిపారు. రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిన భారాస నేతలు మమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.

రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ సబ్‌ కమిటీలో మా సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలందరితో చర్చించిన తర్వాత ఓ నివేదిక తయారు చేస్తాం. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధివిధానాల ఖరారు ఉంటుంది. సంపద సృష్టించి ప్రజలకు పంచాలన్నదే మా ఆలోచన. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మీడియా మిత్రులతో మాట్లాడి దీనిపై నిర్ణయం తీసుకుంటాం” అని భట్టి తెలిపారు.

- Advertisement -

ఏడు మండలాల కోసం బీఆర్ఎస్ దీక్ష చేయాల‌ని డిమాండ్ చేశారు.. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీనే అంటూ ఆరోపించారు. పదేండ్ల పెండింగ్ సమస్యలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తార‌ని వెల్ల‌డించారు. . విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావన లేద‌ని, . బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్డినెన్స్‌తో ఏడు మండలాలను ఏపీలో కలిపార‌న్నారు. ఏడు మండలాల కోసం పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఏమయ్యారంటూ భట్టి ప్రశ్నించారు.

”క్యాబినెట్ విస్తరణ పూర్తిగా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పీసీసీ నూతన చీఫ్ విషయంలో కసరత్తు కొనసాగుతుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. పదిహేనేండ్లు మేమే అధికారంలో ఉంటామని చెపుతున్న కేసీఆర్‌వి కల్లిబొల్లు కబుర్లే. రైతు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. పుట్టింది బతకడానికి.. చావడానికి కాదు. ఆత్మహత్య వెనుక ఎవరున్నారనే దర్యాప్తు కొనసాగుతోంది. ఆత్మహత్య వెనక ఎవరున్నా విడిచిపెట్టేది లేదు” అని భట్టి విక్రమార్క అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement