Friday, September 20, 2024

TG – స్కిల్ వ‌ర్శిటీ ఛైర్మ‌న్ గా ఆనంద్ మ‌హీంద్ర‌…

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ముచ్చెర్లలో నిర్మించబోయే స్కిల్ వర్సిటీ చైర్మ‌న్ గా ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్రను నియమిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అమెరికా టూర్ లో ఉన్న సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. కాగా, ఈ నెల ఒక‌టో తేదిన ముచ్చెర్లలో స్కిల్ వర్సిటీ నిర్మాణానికి రేవంత్ మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇది గడిచిన మరోరోజే సీఎం రేవంత్ రెడ్డిని ఆనంద్ మహింద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ళ అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ ఆ వ‌ర్శిటికి ఆనంద్ మహింద్ర పేరును చైర్మన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement