Sunday, September 29, 2024

TG – అందుబాటులోకి రానున్న 500 ఎలక్ట్రికల్ బస్సులు – పొన్నం

కరీంనగర్ – రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో 500 ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వి.సి సజ్జనార్, ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ , మేడిపల్లి సత్యం ,డాక్టర్ సంజయ్ లతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్ లని మొదటి విడత లో ప్రారంభిస్తున్నామన్నారు. జేబీఎం సంస్థ తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందన్నారు.హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్ లను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఒక్క డిజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తున్నామన్నారు.హైదరాబాద్ లో అన్ని ఎలక్ట్రిక్ బస్ లు నడిపేలా చూస్తామని,విప్లవాత్మక మార్పులు చేస్తూ ఆర్టీసీ ని మెరుగు పరుస్తున్నామన్నారు.

మహా లక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి 3200కోట్ల విలువైన ఉచిత ప్రయాణం మహిళలు చేశారన్నారు. ఆర్టీసీ బస్ లకి ఇప్పుడు డిమాండ్ పెరిగిందని,ఆర్టీసీ, ప్రభుత్వం కలిపి త్వరలోనే బస్ ల కొనుగోలు చేస్తామన్నారు. ఆర్టీసీ లో ఉద్యోగులు ,కార్మికులకు పిఆర్సి ,కారుణ్య నియామకాలు కూడా అమలు చేస్తామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement